తిరుమల శ్రీవారిపై అచంచలమైన భక్తి - వీలునామా ద్వారా రూ. 3 కోట్ల విరాళం..!

తిరుమల శ్రీవారిపై ఓ మాజీ ఐఆర్ఎస్ అధికారి అచంచలమైన భక్తిని చాటుకున్నాడు. తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహం, రూ.66 లక్షలు విరాళం అందజేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆయన మరణించటంతో.. సంబంధిత పత్రాలను టీటీడీకి అందజేశారు.