ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 2025 : ఇవాళ్టి నుంచి ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - ముఖ్య తేదీలివే

ఏపీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.