తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఇకపై ఏ రోజుకు ఆ రోజే శ్రీవాణి టికెట్లపై దర్శనం, కొత్త మార్పులివే

శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనానికి వీలు కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.