తిరుమల అప్డేట్స్ : ఇకపై ఆ టికెట్లు కూడా ఆన్లైన్లోనే..! ఆగస్ట్ 1 నుంచే అమలు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కొత్త అప్డేట్ ఇచ్చింది. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లపై కీలక ప్రకటన చేసింది. ఇకపై ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్లైన్లో మాత్రమే జారీ చేయనుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది.