ధోని, గంభీర్ కాదు ...! ఈ ప్లేయర్ మైండ్‌గేమ్‌తోనే టీమిండియాకు వరల్డ్‌కప్.. ఎవరంటే?

Aug 26, 2025 - 10:57
Aug 26, 2025 - 10:58
 0  2
ధోని, గంభీర్ కాదు ...! ఈ ప్లేయర్ మైండ్‌గేమ్‌తోనే టీమిండియాకు వరల్డ్‌కప్.. ఎవరంటే?

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ 2011 గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇటీవలే రెడ్డిట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై సచిన్ తన అభిమానులతో కూడా మాట్లాడారు. సచిన్ చేసిన ఈ చాట్ 2011 ప్రపంచ కప్ ఫైనల్‌కు సంబంధించిన ఒక కీలక రహస్యాన్ని వెల్లడించింది.

 చాలా మంది టీం ఇండియా ప్రపంచ కప్ ఫైనల్ గెలిచిన ఘనతను మహేంద్ర సింగ్ ధోనీకి ఇస్తారు. మరికొందరు గౌతమ్ గంభీర్‌ను మ్యాచ్ విన్నర్‌గా భావిస్తారు. కానీ, సచిన్ టెండూల్కర్ చేసిన ఈ విషయాలు ఈ దిగ్గజ ఆటగాడి మైండ్ గేమ్‌ను వెల్లడిస్తాయి.ప్రపంచ కప్ 2011 గురించి సచిన్ టెండూల్కర్ కీలక విషయం బయటపెట్టాడు.

 ప్రపంచ కప్ ఫైనల్‌లో ధోని మొదట బ్యాటింగ్ చేయడానికి ఎందుకు వచ్చాడో సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగింది. శ్రీలంక భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో చాలా వరకు, మూడవ వికెట్ పడగానే యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు.

కానీ, చివరి మ్యాచ్‌లో, యువరాజ్ కంటే ముందు ఎంఎస్ ధోని మైదానంలోకి వచ్చాడు. ధోనిని ముందుగా బ్యాటింగ్‌కు పంపాలనే నిర్ణయం సచిన్ టెండూల్కర్ తీసుకున్నాడు. ఇది 14 సంవత్సరాల తర్వాత నేడు వెల్లడైంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో, యువరాజ్ సింగ్ 21 పరుగులతో అజేయంగా తిరిగి వచ్చాడు. ఈ ప్రపంచ కప్‌లో ధోని విన్నింగ్ షాట్ కొట్టాడు.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనిని బ్యాటింగ్‌కు పంపింది సచిన్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఒకసారి ప్పాడు. దీనిపై ఓ అభిమాని సచిన్ టెండూల్కర్‌ను రెడ్డిట్‌లో ప్రశ్నించాడు. ఇది నిజమేనా, దీని వెనుక మీరు ఏ వ్యూహం ఆలోచించారో నాకు తెలుసుకోవాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.దీనికి సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ, దీని వెనుక రెండు కీలక కారణాలు ఉన్నాయి. మొదటిది ఎడమ-కుడి బ్యాటింగ్ కలయిక, ఎందుకంటే, ఇది ఆఫ్-స్పిన్నర్లను ఇద్దరినీ ఇబ్బంది పెట్టవచ్చు’ అని అన్నారు.

 ఇక రెండవ కారణం గురించి సచిన్ చెబుతూ, ‘ముత్తయ్య మురళీధరన్ 2008 నుంచి 2010 వరకు మూడు సంవత్సరాలు చెన్నై తరపున ఆడాడు. కాబట్టి, ఎంఎస్ ధోని కూడా నెట్స్‌లో మురళీధరన్ బంతిని ఎదుర్కొన్నాడు. అలాగే, అతని బౌలింగ్‌లో 3 సంవత్సరాలు ఆడిన అనుభవం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.