రాక్ సాల్ట్ గుండె, మెదడుపై ప్రభావం..!
భారత్లో రాక్ సాల్ట్ మైన్లు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఉన్నాయి.అమెరికా మ్యాగజీన్ 'ఫుడ్ అండ్ వైన్' ప్రకారం.. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఖేవ్రా సాల్ట్ మైన్ రాక్ సాల్ట్కు ప్రధాన సోర్స్.'' రాక్ సాల్ట్ను మితంగా ఉపయోగించినప్పుడు ఆరోగ్యానికి మంచిది.
కాల్షియం, మెగ్నేషియం, పొటాషియం వంటి అత్యవసరమైన ఖనిజాలు దీనిలో ఉన్నాయి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు ఇవి సాయపడతాయి. హైడ్రేషన్ను మెరుగుపరుస్తాయి. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో సాయపడతాయి'' అని ఎయిమ్స్లో డైటీషియన్గా పనిచేసిన, వన్ డైట్ టుడే ఫౌండర్ డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.
ఈ సాల్ట్ను మితంగా వాడటం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.మెరుగైన ఆరోగ్యం కోసం పచ్చళ్లు, పాపడ్లు, జామ్లు వంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో పాటు టేబుల్ సాల్ట్ను కూడా తినకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.సోడియం శరీరంలో నీటిని సరైన స్థాయిలో నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది.
అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలను సరఫరా చేయడంలో ఇది చాలా కీలకం.సోడియం మన నరాలకు మెరుపు వేగమైన ప్రతిస్పందనను అందిస్తుంది. అయితే, మితంగా ఉప్పును తీసుకుంటూ ఉండాలని ఎల్లప్పుడూ వైద్యులు సిఫారసు చేస్తుంటారు.మితంగా తీసుకోవడమనేది చాలా కీలకమని డాక్టర్ అను అగర్వాల్ చెప్పారు.
దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అవయవాలకు హాని కలుగుతుందని తెలిపారు.'' రాక్ సాల్ట్లో అసలు అయోడిన్ ఉండదు. ఈ ఉప్పుకు అతిపెద్ద లోపమిదే. అయోడిన్ లోపం వల్ల గాయిటర్(థైరాయిడ్ గ్రంథి సమస్య కారణంగా మెడ వద్ద వాపు)కు కారణమవుతుంది.
ఇది మాత్రమే కాదు, అధిక రక్తపోటు, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. ఇది మెటబాలిజంపై (జీవక్రియపై) కూడా ప్రభావం చూపుతుంది'' అని డాక్టర్ అను అగర్వాల్ వివరించారు.ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు చేసింది.
5 గ్రాముల కంటే తక్కువ అంటే, సుమారు ఒక టీస్పూన్ అంత.ఆస్ట్రేలియాలోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రకారం.. సగటు భారతీయుడు రోజూ సుమారు 11 గ్రాముల ఉప్పు తింటున్నారని తెలిసింది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు ఇది సుమారు రెండింతలు.భారత్లో అధిక ఉప్పు వినియోగం ''కనిపించని మహమ్మారికి'' దారితీస్తుందని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అర్బన్ ప్రాంతాల్లో నివసించే భారతీయులు రోజూ సగటున 9.2 గ్రాముల ఉప్పును తింటున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో రోజూ సుమారు 5.6 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని తెలిపాయి.రాక్ సాల్ట్ను హాలైట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది కేవలం కిచెన్కు మాత్రమే పరిమితం కాలేదు.
డీటాక్సిఫయర్లా(శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించే మూలకం) కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడం నుంచి గొంతు నొప్పులను తగ్గించడం, చర్మాన్ని మెరుగుపర్చడం, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం వరకు రాక్ సాల్ట్ను ఒక బహుముఖ సహజ నివారిణిగా చూస్తున్నారు.
'' డీటాక్సిఫైర్లా రాక్ సాల్ట్ పనిచేస్తుంది. వెచ్చని నీటిలో పరిమిత మోతాదులో తీసుకుంటే, జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది. దీన్ని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే, స్కిన్ పోర్స్ తెరుచుకుని, టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి.
అలాగే, రక్తప్రసరణ మెరగవుతుంది'' అని మలేషియన్ న్యూట్రిషనిస్ట్ సాంగ్ విన్ వా చెప్పారు.రాక్ సాల్ట్లో ఉండే ఖనిజాలు మెగ్నేషియం, సల్ఫర్ వంటివి శరీరానికి సహజంగా డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ జరిగేందుకు సాయపడతాయని అన్నారు.