భారత్‌పై టారిఫ్‌లు విధించి, పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్

అమెరికాలోని టెక్సస్‌లో 2019లో 'హౌడీ మోదీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డోనల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. ' అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే) అనే నినాదాన్ని చేశారు.

Aug 4, 2025 - 11:12
 0  2
భారత్‌పై టారిఫ్‌లు విధించి, పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్

డోనల్డ్ ట్రంప్ ఆ తర్వాత సంవత్సరం భారత్‌కు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లో ఆయనకు స్వాగతం పలుకుతూ 'నమస్తే ట్రంప్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీంతో, భారత్-అమెరికా మధ్య సంబంధాలను ఇద్దరు నేతల మధ్య సంబంధంగా చూడటం ప్రారంభించింది మీడియా. కానీ, గత ఆరునెలలుగా ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధం మునపటిలా లేదు.

అమెరికాలోని టెక్సస్‌లో 2019లో 'హౌడీ మోదీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డోనల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. ' అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే) అనే నినాదాన్ని చేశారు.

రెండు దేశాల నేతల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయడానికి సంకేతంగా విశ్లేషకులు దీన్ని చూశారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగా, ట్రంప్ కూడా మరోసారి అధికారాన్ని చేపట్టారు.